ఆంధ్రప్రదేశ్‌

స్వార్థం కోసమే మూడు రాజధానులు: లోకేష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ(సిటీ), జనవరి 25: దేశ చరిత్రలో అన్నంపెట్టే రైతులపై దాడి చేయించి రైతు ద్రోహిగా ఏపీ సీఎం జగన్ చరిత్రలో నిలిచిపోయారని మాజీ మంత్రి నారా లోకేష్ విమర్శించారు. ప్రజల్ని ఒప్పించ లేని జగన్ దాడులకు దిగబడటం దారుణమంటూ శనివారం ట్విట్టర్ వేదికగా ఆరోపించారు. మూడు రాజధానుల్లో ఆయన స్వార్థం తప్ప వేరే ఏమీ లేదనే విషయం ప్రజలకు అర్థమయిందనే ఆందోళన ఇప్పుడు జగన్‌ను వెంటాడుతోందన్నారు.
అందుకే వైసీపీ రౌడీలను రంగంలోనికి దింపి శాంతియుతంగా దీక్ష చేస్తున్న తెనాలి అమరావతి జేఏసీ శిబిరానికి నిప్పు అంటించారన్నారు. రైతులు, మహిళల పై విచక్షణారహితంగా వైకాపా గుండాలు దాడులు చేశారన్నారు. తెనాలిలో వైసీపీ గుండాలు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ప్రకటించారు. వైసీపీ, సీఎం జగన్ చేసే తాటాకు చప్పుళ్ళకు భయపడే వారు ఎవరూ లేరన్నారు.