ఆంధ్రప్రదేశ్‌

రాజధాని రైతులకు భరోసాగా నిలుద్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ(సిటీ), జనవరి 28: రాజధాని కోసం భూములు త్యాగం చేసిన రైతుల దగ్గరకు భారతీయ జనతాపార్టీ, జనసేన సంయుక్తంగా వెళ్లి, వారికి అండగా నిలవాలని ఉభయ పార్టీల నేతలు నిర్ణయించారు. రైతులకు భరోసా కల్పించాలని, రాజధాని అమరావతి విషయంలో రెండు పార్టీలు కలిసి పోరాటం చేయాలని నిర్ణయించాయి. నగరంలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం భారతీయ జనతాపార్టీ - జనసేన పార్టీ నాయకుల సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి బీజేపీ నుండి మాజీ కేంద్ర మంత్రి దగ్గుబాటి పురంధ్రీశ్వరి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, శాంతారెడ్డి హాజరయ్యారు. జనసేన పార్టీ నుండి పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్‌తో పాటు టి శివశంకర్, కందుల సురేష్, మధుసూదన్‌రెడ్డి, గంగులయ్య, బి శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సమన్వయ కమిటీ సమావేశంలో మూడు రాజధానుల అంశం, రాజధాని రైతుల ఆందోళనతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం కావడంపై ఉభయపార్టీల నేతలు సుదీర్ఘంగా చర్చించారు. అమరావతి ప్రస్తుత దుస్థితికి నాడు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ, నేడు అధికారంలో ఉన్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలు రెండూ బాధ్యులే అంటూ సమన్వయ కమిటీ అభిప్రాయపడింది. రాజధాని మార్పు విషయంలో కేంద్ర ప్రభుత్వానికి చెప్పి చేస్తున్నామని అధికార వైసీపీ ప్రచారం చేస్తోందని, ఇది పూర్తిగా సత్యదూరమైన ప్రచారమన్నారు. ఇలాంటి అబద్ధాలు, అభూత కల్పనలు ప్రచారం చేయడంలో గతంలో అధికారంలో ఉన్న టీడీపీ మాదిరిగానే ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ కూడా వ్యవహరిస్తోందని కమిటీ అభిప్రాయపడింది. బీజేపీ - జనసేన పార్టీలు కలిసి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ఇందుకోసం క్షేత్రస్థాయిలో కమిటీలను నియమించాలని తీర్మానించారు. ఉభయ పార్టీల అధ్యక్షులు ఆమోదం తెలిపిన తరువాత కమిటీ సభ్యులను ఎంపిక చేసే విధంగా సమావేశంలో నిర్ణయించారు.