ఆంధ్రప్రదేశ్‌

ప్రజలు బుద్ధిచెప్పినా మారని బాబు తీరు: అంబటి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జనవరి 28: గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు బుద్ధిచెప్పినా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు తీరు మారలేదని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు విమర్శించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం జరిగిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో మండలి లేకుండానే పరిపాలన జరుగుతోందని, గతంలో ఎన్‌టీఆర్ తీసుకున్న నిర్ణయానే్న ఇప్పుడు శాసనసభలో పెట్టి ఆమోదం తీసుకున్నామన్నారు. అసెంబ్లీలో తీర్మానం ఆమోదం పొందిన తర్వాత చంద్రబాబు అనేక ఆరోపణలు, సవాళ్లు చేశారని, కీలకమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు శాసనసభ వేదికను చంద్రబాబు ఎందుకు ఉపయోగించుకోకుండా పారిపోయారని ప్రశ్నించారు. ఎనిమిది నెలల ప్రభుత్వాన్ని రద్దు చేయాలని ప్రతిపక్ష నేత కోరడం అజ్ఞానమని, కావాలంటే టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామా చేసి ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు. చంద్రబాబు శాశ్వతంగా రాజకీయాలకు గుడ్‌బై చెప్పే రోజు ఆసన్నమైందని, అందుకే పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు.