ఆంధ్రప్రదేశ్‌

దుర్గగుడి పాలక మండలిలో ప్రొద్దుటూరు ఎమ్మెల్యే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ ( ఇంద్రకీలాద్రి) ఫిబ్రవరి 22: శ్రీ కనకదుర్గమ్మ దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యుడిగా కడప జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గ శాసన సభ్యుడు రాచమల్లు శివప్రసాద్‌రెడ్డిని నియమించడం ఇక్కడ చర్చనీయాంశమైంది. రెండు రోజుల క్రితం 16మందిని ట్రస్ట్‌బోర్టు సభ్యులుగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేసింది. కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని ఎమ్మెల్యేలకు స్థానం కల్పించకుండా, కడప జిల్లా ఎమ్మెల్యేకు స్థానం కల్పించడం గమనార్హం. దేవదాయ ధర్మదాయశాఖ కమిషనర్ కార్యాలయం నుండి ఉత్తర్వులు అందుకున్న తర్వాత 16మంది తొలుత దుర్గగుడి ట్రస్ట్‌బోర్డు సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం చైర్మన్ ఎన్నుకొంటారు. ఇదిలా ఉండగా చైర్మన్‌గా పైలా సోమినాయుడు పేరు గత కొద్ది నెలలుగా వినబడుతోంది. ప్రభుత్వ ఉత్తర్వులు జారీ ఆయిన వెంటనే పైలా సోమినాయుడు కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శనం చేసుకొని కాబోయే చైర్మన్ తానే అంటూ సంకేతాలు పంపారు. అయితే మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు వర్గీయులు కొందరు సోమినాయుడిని వ్యతిరేకిస్తున్నారు.