ఆంధ్రప్రదేశ్‌

రాష్ట్ర చరిత్రలో విఫల నేత బాబే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, ఫిబ్రవరి 25: రాష్ట్ర చరిత్రలోనే ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఓ విఫల నేత అని, తన ఐదేళ్ల పాలనపై ఆత్మపరిశీలన చేసుకోకుండా ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిపై ఆరోపణలు చేయడం దారుణమని వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీ్ధర్‌రెడ్డి మండిపడ్డారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం జరిగిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు అండ్ కో తప్పు చేశారు కాబట్టే సిట్‌ను తప్పుబడుతున్నారని, తప్పు చేయకుంటే భయమెందుకని ప్రశ్నించారు. ప్రజా సంక్షేమ పాలనకై వివిధ పథకాలు అమలు చేస్తున్న ముఖ్యమంత్రిని నరకాసురుడుగా పేర్కొనడాన్ని ఆయన ఆక్షేపించారు. సిట్ ఏర్పాటుతో చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని, చంద్రబాబు జనాదరణ లేని జనచైతన్య యాత్రలు చేస్తున్నారని విమర్శించారు. స్థానిక ఎన్నికలకు టీడీపీకి అభ్యర్థులు లేకే ఎన్నికలను అడ్డుకుంటున్నారని, కొర్రీలు పెట్టి కోర్టుల్లో వాయిదాలు వేయిస్తున్నారన్నారు.

శివరామకృష్ణన్ కమిటీ
అభివృద్ధి వికేంద్రీకరణకే మొగ్గు: జోగి రమేష్
రాష్ట్ర విభజన అనంతరం రాజధాని కోసం ఏర్పాటుచేసిన శివరామకృష్ణన్ కమిటీ అభివృద్ధి వికేంద్రీకరణకే మొగ్గు చూపిందని వైసీపీ పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ పేర్కొన్నారు. మంగళవారం తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికారంలో ఉండగా అమరావతి పేరుతో బాబు ఇటుకలు అమ్ముకున్నారని, ఇప్పుడేమో అమరావతి పోయిందని జోలె పట్టారని ఎద్దేవాచేశారు. చివరకు హుదూద్ తుఫాన్ సమయంలో కూడా ప్రజల నుండి డబ్బు దండుకున్నారని ఆరోపించారు.