ఆంధ్రప్రదేశ్‌

కబ్జాల బాగోతం బయటపడుతుందనే అడ్డంకులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, ఫిబ్రవరి 27: విశాఖలో జగన్, ఆయన బృందం చేసిన భూకబ్జాల బాగోతం బయట పడుతుందనే భయంతోనే చంద్రబాబు విశాఖ పర్యటనకు వైసీపీ నేతలు అడ్డంకులు సృష్టిస్తున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీమంత్రి యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. గురువారం ఈ మేరకు మంగళగిరి సమీపంలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయం నుండి ఒక ప్రకటన విడుదల చేశారు. జగన్‌ది తొలి నుంచి ఫ్యాక్షన్ నైజమంటూ, ఆయన అరాచకాల కోసం పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేస్తారా అంటూ మండిపడ్డారు. టీడీపీ ప్రభుత్వం ఇలాగే చేసి ఉంటే 2003లో రాజశేఖరరెడ్డి పాదయాత్ర, 2017లో జగన్మోహనరెడ్డి పాదయాత్ర చేసి ఉండేవారే కాదన్నారు. గృహ నిర్బంధాలు టీడీపీ నేతలకే పరిమితమా, మాజీ ముఖ్యమంత్రిని విమానాశ్రయం వద్దే నిలిపేస్తారా, ఆయన కాన్వాయ్‌పై కోడిగుడ్లు, టమాటాలు విసురుతారా అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు.