ఆంధ్రప్రదేశ్‌

బాబు భయపడింది అందుకే..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (సిటీ), ఫిబ్రవరి 21: స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నేతలు ఇచ్చే డబ్బు, మద్యాన్ని తీసుకునేందుకు ఓటర్లు నిరాకరించారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత వీ విజయసాయిరెడ్డి అన్నారు. అందుకే ఈ ఎన్నికల్లో సింగిల్ డిజిట్‌కే పరిమతం అవుతామనే భయం చంద్రబాబుకు పట్టుకుందని శనివారం ట్విట్టర్‌లో విమర్శించారు. తన మనుగడ గోసం చంద్రబాబు కులం, ప్రాంతం కార్డులను వాడతున్నారన్నారు. ఆయనను నమ్మి చెప్పినట్టు చేసినవారు తర్వాత సస్పెన్షన్లు, కేసులను ఎదుర్కోవడం చూస్తున్నామన్నారు. అయినా సూసైడ్ స్క్వాడ్ సభ్యులు కులదైవం కోసం ఆరాటపడుతూనే ఉన్నారని విమర్శించారు. వీళ్ల ఆటలు కొన్నిరోజులు సాగినా చివరకు చట్టాల ముందు తలొంచాల్సిందేనన్నారు. స్థానిక ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు ఆశ చూపిన డబ్బు తీసుకోడానికి ఓటర్లు కరాఖండిగా తిరస్కరించారని గుర్తుచేశారు. అందుకే చంద్రబాబులో భయం మొదలైందన్నారు. డబ్బు, మందు లేకుండా ఎలక్షన్లు జరిగితే జిల్లాల వారీగా సింగిల్ డిజిట్‌కే పరిమితమవుతామన్న ఆందోళనలో బాబు డ్రామాలను మొదలు పెట్టారన్నారు. నిమ్మగడ్డతో వాయిదా నాటకం ఆడించింది చంద్రబాబేనంటూ ఆయన కామెంట్ చేశారు.
బాబైనా, నిమ్మగడ్డయినా తప్పించుకోలేరు!
సీఈసీ రాసినట్లుగా ఉన్న లేఖ అంశంలో చంద్రబాబయినా, నిమ్మగడ్డ రమేష్‌కుమార్ అయినా సరే ఇందులోంచి తప్పించుకోలేరంటూ మరో ట్వీట్‌లో విజయసాయిరెడ్డి హెచ్చరించారు. నిమ్మగడ్డ రాసినట్లు చెబుతున్న లేఖ ఎవరు సృష్టించినా, పంపినా క్రిమినల్ కేసులు ఎదుర్కోక తప్పదన్నారు. అందులో ప్రభుత్వాన్ని అప్రదిష్టపాలు చేసే ఆరోపణలు, ఆర్డినెన్స్‌ను తప్పుపట్టే వ్యాఖ్యలు ఉన్నాయన్నారు. చంద్రబాబయినా, ఎలక్షన్ కమిషనర్ అయినా తప్పించుకోలేరంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.