ఆంధ్రప్రదేశ్‌

ఉత్తర కోస్తాకు వర్ష సూచన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మార్చి 27: మధ్యప్రదేశ్, కర్నాటక మీదుగా దక్షిణ తమిళనాడు వరకూ అల్పపీడన ద్రోణి ఆదివారం విస్తరించి ఉంది. ఇది సోమవారం నాటికి ప్రస్తుతం ఉన్న ప్రాంతం నుంచి కదిలే అవకాశం ఉందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం ఆదివారం రాత్రి తెలిపింది. దీని ప్రభావం వల్ల రానున్న 48 గంటల్లో ఉత్తర కోస్తా జిల్లాల్లో అక్కడక్కడ వర్షం కురిసే అవకాశం ఉంది. ఆదివారం రాష్ట్రంలో సాధారణ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని తెలిపింది. ఇదిలా ఉండగా ఆదివారంనాటి ఎండ తీవ్రతకు విజయనగరం జిల్లా బొండపల్లి మండలం మరువాడ గ్రామానికి చెందిన కురమాన వెంకునాయుడు (70), విశాఖ జిల్లా ముంచంగిపుట్టు మండలం కించాయిపుట్టు గ్రామానికి చెందిన రొబ్బా లక్ష్మయ్య (50) మృతి చెందారు.