ఆంధ్రప్రదేశ్‌

ఇసుక లారీ ఢీకొని ముగ్గురు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పినపాక, నవంబర్ 20: అతివేగంగా వెళ్తున్న ఇసుక లారీని ద్విచక్రవాహనం ఢీకొట్టడంతో ముగ్గురు యువకులు మృతి చెందిన సంఘటన ఆదివారం మండల భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుగినేపల్లి పంచాయతీ చేగరిసెల గ్రామంలో జరిగింది. ప్రత్యక్షసాక్షులు, పోలీసులు అందించిన సమాచారం ప్రకారం మణుగూరు నుంచి లారీ ఇసుకతో ఏటూరునాగారం వైపు వేగంగా వెళ్తుండగా ఎదురుగా వస్తున్న ముగ్గురు యువకులతో వేగంగా వెళుతున్న ద్విచక్ర వాహనంతో బలంగా ఢీకొన్నారు. దీంతో వారు ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. ప్రమాద ప్రాంతాన్ని పరిశీలించిన ఏడూళ్ళబయ్యారం సీఐ నర్సయ్య అందించిన వివరాల ప్రకారం ఘటనలో పోట్లపల్లి పంచాయితీ గడ్డంపల్లి గ్రామానికి చెందిన పడిగ వీరభద్రం(28), తాళ్లపల్లి సమ్మయ్య(30), వారికి సమీప బంధువు సూర్యపేట జిల్లా తుంగకూర్తి మండలం తొట్టపర్తికి చెందిన బండారు వీరాస్వామి(33) మరణించారని చెప్పారు.