ఆంధ్రప్రదేశ్‌

అమరావతి రైతుల కోసం ఓ పత్రిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 1: రాజధాని రైతుల కోసం ప్రభుత్వం ఒక పత్రికను విడుదల చేయబోతోంది. అలాగే రాజధాని ప్రాంతంలో పెట్టుబడులు ఆహ్వానించేందుకు కూడా మరో పత్రికను తీసుకురాబోతోంది. ఈ బాధ్యతలను సిఆర్‌డిఏకి ప్రభుత్వం అప్పగించింది. రాజధాని ప్రాంతంలో ప్రభుత్వం చేపడుతున్న కార్యకలాపాలు, నిర్మాణ పనులు, జిఓలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఇందులో పొందుపరచనున్నారు. అంతర్జాతీయ స్థాయిలో రూపుదాల్చనున్న రాజధానికి సంబంధించి ముఖ్య విషయాలు రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు తెలియచేయాల్సిన బాధ్యత ఉందని సిఆర్‌డిఏ అధికారులు అభిప్రాయపడ్డారు. దీంతో ఒక మాస పత్రిక ద్వారా ఈ సమాచారాన్ని రైతులకు చేరవేయాలని నిర్ణయించారు. రాజధాని భూముల విషయంలో జరుగుతున్న ప్రచారానికి ప్రభుత్వం ఎప్పటికప్పుడు సమాధానాలు ఇవ్వడానికి వీలుకుదరట్లేదు. వీటన్నింటికీ ఈ మాసపత్రిక ద్వారా సమాధానం ఇవ్వాలని ఆలోచన చేస్తోంది. అలాగే, విదేశీ పెట్టుబడులను ఆహ్వానించేందుకు మరో పత్రికను సిద్ధం చేస్తోంది. రాజధాని ప్రాంతంలో పెట్టుబడులను పెట్టడానికి ఉన్న అవకాశాలను, వలనరుల గురించి ఈ పత్రికలో వివరించబోతున్నారు.