ఆంధ్రప్రదేశ్‌

8న వరుపుల, 11న జ్యోతుల టిడిపిలో చేరిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 1: సీనియర్ రాజకీయ నాయకులు జ్యోతుల నెహ్రూ, వరుపుల సుబ్బారావు తెలుగుదేశం పార్టీలో చేరేందుకు ముహూర్తం ఖరారు చేశారు. ఈ నెల ఎనిమిదవ తేదీన వరుపుల సుబ్బారావు, 11వ తేదీన జ్యోతుల నెహ్రూ టిడిపిలో చేరనున్నారు. జ్యోతుల నెహ్రూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్ష ఉప నాయకునిగా పనిచేశారు. ఇటీవలే ఆయన పార్టీకి రాజీనామా చేసి సంగతి తెలిసిందే. ఆయన ఈ నెల 11వ తేదీన విజయవాడలో చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరనున్నారు. అలాగే వరుపుల సుబ్బారావు ఎనిమిదవ తేదీ మధ్యాహ్నం రెండు గంటలకు విజయవాడలో చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరనున్నారు. జగ్గంపేట నియోజకవర్గం నుంచి జ్యోతుల నెహ్రూ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రత్తిపాడు నియోజకవర్గానికి వరుపుల ప్రాతినిథ్యం వహిస్తున్నారు. వరుపుల సుబ్బారావు ‘ఆంధ్రభూమి’తో మాట్లాడుతూ వైకాపాలో ఎమ్మెల్యేలకు విలువ లేకుండా పోయిందని అన్నారు.