ఆంధ్రప్రదేశ్
అధికారులపై గ్రామస్థుల దాడి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 18 January 2017
అవుకు, జనవరి 17: విద్యుత్ చౌర్యాన్ని అరికట్టేందుకు గాను గ్రామంలో తనిఖీలకు వెళ్లిన విద్యుత్శాఖ అధికారులపై ప్రజలు కర్రలతో దాడి చేశారు. ఈ సంఘటన కర్నూలు జిల్లా అవుకు మండలం అన్నవరంలో మంగళవారం జరిగింది. డోన్ డివిజన్ విద్యుత్శాఖ అధికారులు అన్నవరం గ్రామంలోని ఇళ్లలో విద్యుత్ మీటర్ల రీడింగ్ నమోదు చేపట్టారు. కొన్ని ఇళ్లలో మీటర్లు లేకపోవడం గమనించారు. దీంతో కొంతమంది వినియోగదారులు తనిఖీ అధికారులపై మూకుమ్మడిగా కర్రలతో దాడిచేసి కొట్టారు. దీంతో వెల్దుర్తి, జలదుర్గం, క్రిష్ణగిరి ఏఇలు నాగేశ్వరరెడ్డి, బాలస్వామి, ఖలీల్బాషా, వెల్దుర్తి టౌన్ లైన్మెన్ రమేష్కు తీవ్ర గాయాలయ్యాయి.