ఆంధ్రప్రదేశ్‌

అనంతలో పేలిన డిటోనేటర్లు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, జనవరి 17 : డిటోనేటర్లు పేలి ఇద్దరు చిన్నారులు తీవ్రంగా గాయపడిన సంఘటన మంగళవారం అనంతపురం జిల్లా కనగానపల్లి మండలం మద్దెలచెరువు గ్రామంలో చోటుచేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు.. ఫ్యాక్షన్‌కు నిలయం, మావోయిస్టుల ప్రభావిత ప్రాంతమైన మద్దెలచెరువు గ్రామంలో మంగళవారం సాయంత్రం 6.30 గంటల సమయంలో కొందరు చిన్నారులు ఆడుకుంటూ పాడుబడిన మొండిగోడలతో ఉన్న ఓ ఇంటిలోకి వెళ్లారు. అక్కడ ఇద్దరు చిన్నారులకు రెండు డిటొనేటర్లు దొరికాయి. దీంతో చిన్నారులు వాటిని బయటకు తీసుకొచ్చి రాయిపై పెట్టి మరో రాయితో గట్టిగా కొట్టడంతో పేలాయి. ఈ సంఘటనలో గ్రామానికి చెందిన కురుబ చెన్నప్ప కుమారుడు ప్రశాంత్(11), ఆచారి నాగరాజు కుమారుడు కల్యాణ్(10) తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో డిటోనేటర్లను రాయితో కొట్టిన ప్రశాంత్ కుడిచేయి ఛిద్రం కావడంతో పాటు శరీరంపైనా గాయాలయ్యాయి. సమీపంలోనే ఉన్న కల్యాణ్ తీవ్రంగా గాయపడ్డాడు.