ఆంధ్రప్రదేశ్
శ్రీవారి సేవలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Sunday, 10 April 2016
తిరుమల: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని శనివారం రాత్రి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఠాకూర్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆయన ఆలయం మహాద్వారం వద్దకు రాగానే టిటిడి చైర్మన్ డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి, ఇఓ డాక్టర్ సాంబశివరావు, తిరుమల జెఇఓ శ్రీనివాసరాజు స్వాగతం పలికారు. ఠాకూర్ పది నిమిషాలపాటు స్వామిని దర్శించుకున్నారు. ఈసందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు స్వామి వారి వైభవాన్ని, ఆలయ విశిష్టాన్ని ఆయనకు హిందీలో వివరించారు. అనంతరం హుండీ వద్దకు చేరుకొని కానుకలు సమర్పించుకున్నారు. అనంతరం రంగనాయక మండపం వద్ద ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం చేశారు.