ఆంధ్రప్రదేశ్‌

పారదర్శకంగా ల్యాండ్ పూలింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జనవరి 31: దేశంలో ఎక్కడా లేని విధంగా ల్యాండ్ పూలింగ్ ద్వారా భూ సమీకరణకు ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. విశాఖలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ల్యాండ్ పూలింగ్ పూర్తి పారదర్శకంగా జరుగుతుందన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకే ల్యాండ్ పూలింగ్ చేపడుతున్నారని, దీనిలో ఎటువంటి అక్రమాలకు తావు లేదన్నారు. ల్యాండ్ పూలింగ్‌కు సంబంధించి ఆయా ప్రాంతాల్లో ముందుగా ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేస్తుందని, గ్రామ సభల నిర్వహణ అనంతరం రైతుల అంగీకారంతోనే భూములను తీసుకుంటామని వెల్లడించారు.