ఆంధ్రప్రదేశ్‌

ఎడమ కాలువ నత్తనడక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 13: కృష్ణాకు నీరివ్వాలనే ఉద్దేశంతో పట్టిసీమ ఎత్తిపోతల పథకం కోసం ఏదో విధంగా పోలవరం కుడి ప్రధాన కాల్వ నిర్మాణాన్ని పూర్తిచేశారు.. కానీ ఎడమ ప్రధాన కాలువ పనులకు మాత్రం అతీగతీ కన్పించడం లేదు. పురుషోత్తపట్నం పథకం ద్వారా ఏలేరు ఆయకట్టును స్థిరీకరించాలనే ధ్యాస తప్ప లక్ష్యం మేరకు పోలవరం ఎడమ ప్రధాన కాల్వను పూర్తిచేయాలనే ధ్యేయం మాత్రం పాలకుల్లో కన్పించడం లేదు. పోలవరం ఎడమ కాల్వ పూర్తయితే తప్ప విశాఖ పారిశ్రామిక అవసరాలు, తాగునీటి అవసరాలు, వంశధార సుజల స్రవంతి పథకానికి అనుసంధానం చేసే లక్ష్యం నెరవేరే పరిస్థితి లేదు. ఎడమ ప్రధాన కాల్వ ద్వారా 23.44 టిఎంసిల నీటిని సరఫరా చేయాలని నిర్దేశించారు. 10.13 లక్షల ఎకరాల గోదావరి డెల్టా ఆయకట్టు, 13.08 లక్షల ఎకరాల్లో కృష్ణా డెల్టా ఆయకట్టు స్థిరీకరణ పోలవరం ప్రధాన లక్ష్యం. ఎడమ ప్రధాన కాల్వ పనులు ఇప్పటివరకు కేవలం 55 శాతమే జరిగాయి. మొత్తం ప్రాజెక్టు 2018 నాటికి పూర్తిచేయాలనేది ముందుగా నిర్ణయించిన లక్ష్యం కాగా ఇటీవల మరో ఏడాది లక్ష్యాన్ని పెంచారు. కానీ నిర్దేశిత ఎడమ ప్రధాన కాలువ పనులు మాత్రం పూర్తయ్యే పరిస్థితి కన్పించడం లేదు. ఈ కాలువ పనులు పూర్తిచేయాలంటే అనేక ప్రతిబంధకాలను అధిగమించాల్సివుంది. ఎడమ ప్రధాన కాల్వ ప్యాకేజీ 2, ప్యాకేజీ 4లో హెచ్‌పిసిల్, గెయిల్ పైపులైన్ల మార్పునకు అనుమతులు రావాల్సివుంది. అంతేకాకుండా ప్యాకేజీ 2లో 34.250 కిలో మీటర్ల నుంచి 37.200 కిలో మీటర్ల వరకు మధ్య మార్గంతో పాటు విద్యుత్ లైన్లను తరలించాల్సివుంది. ఈ కాల్వ మార్గంలో పట్టా, అటవీ, దేవాదాయ శాఖ భూముల్లో మిగులు భూమి 334.92 ఎకరాలు సేకరించడానికి చర్యలుచేపట్టారు. ప్యాకేజీ 5లో దాదాపు 50 ఏకరాల పట్టా భూమి అవసరంగా నిర్దేశించారు. ప్యాకేజీ 5, ప్యాకేజి 8లో కొన్ని కోర్టు కేసులు కూడా పెండింగ్‌లోవున్నాయి. ప్యాకేజీ 1లో హెచ్‌పిసిఎల్, గెయిల్ పైపులైన్లను మార్చాల్సి వుంది. ప్యాకేజీ 8లో హెచ్‌పిసిఎల్, గెయిల్ పైపులైన్ల క్రాసింగ్‌లు, రెండుచోట్ల రైల్వే క్రాసింగ్‌లకు అనుమతులు పొందాల్సి వుంది. ఇన్ని ప్రతిబంధకాలను దాటుకుని పోలవరం ఎడమ ప్రధాన కాల్వ పనులను నిర్దేశిత లక్ష్యం మేరకు పూర్తిచేయాల్సివుంది. ఇవన్నీ వదిలేసి ముందుగా ఏలేరు రిజర్వాయర్‌కు పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి నీటిని అనుసంధానం చేసి ఏలేరు ఆయకట్టు 58 వేల ఎకరాలకు పూర్తిస్థాయి స్థిరీకరణ చేయడంతో పాటు ఏలేరుల నుంచి ఇప్పటికేవున్న పైపులైన్, కాల్వల ద్వారా విశాఖ పారిశ్రామిక అవసరాలకు, తాగునీటి అవసరాలకు అందించేందుకు ఏర్పాట్లుచేస్తున్నారు.

చిత్రం..పోలవరం ప్రాజెక్ట్ దృశ్యం