ఆంధ్రప్రదేశ్‌

కరవుసీమలో పాతాళగంగ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం జిల్లాలో విచిత్రం జరిగింది. కరవు నేలలో పాతాళ గంగ పెల్లుబికింది. అన్నదాతలను ఆశ్చర్యంలో ముంచెత్తింది. సోమందేపల్లి మండలం తుంగోడు గ్రామంలో రైతు శ్రీనివాసాచారి తన పొలంలో నాలుగు బోర్లు వేశాడు. ఒక్కదాంట్లోనూ చుక్కనీరు పడలేదు. అయినా పట్టువదలని విక్రమార్కుడిలా ఐదో బోరు తవ్వించాడు. 570 అడుగుల లోతులో నీరు పుష్కలంగా పడింది. మోటార్ సాయం లేకుండానే నీరు పెల్లుబికి రావడంతో శ్రీనివాసాచారి ఆనందానికి అవధుల్లేవు. ఈ చోద్యం చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల రైతులు, ప్రజలు తరలివస్తున్నారు.
-ఆంధ్రభూమి విలేఖరి, సోమందేపల్లి
chitram....
బోరుబావి నుంచి ఉబికి వస్తున్న నీటిని చూసేందుకు తరలివచ్చిన రైతులు