ఆంధ్రప్రదేశ్‌

ప్రజల్లోకి ఎలా వెళ్లాలి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఫిబ్రవరి 20: ఉత్తరాంధ్ర పట్ట్భద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు తెలుగు తమ్ముళ్లకు విషమపరీక్ష పెట్టింది. ఎమ్మెల్సీ స్థానాన్ని మిత్రపక్షమైన బిజెపికి కేటాయించిన టిడిపి అధిష్ఠానం అభ్యర్థి విజయానికి కలిసి పనిచేయాలంటూ ఆదేశించింది. దీనికి సంబంధించి ఇరు పార్టీల నేతలతో సమన్వయ కమిటీకి రూపకల్పన చేశారు కూడా. సాధారణ ఎన్నికల అనంతరం తొలిసారిగా ఎన్నికల ప్రచారానికి వెళ్తున్న టిడిపి, బిజెపి ద్వయం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులతో అయోమయంలో ఉన్నారు. గత ఎన్నికల్లో బిజెపి, టిడిపి కలిసి పనిచేయగా, జనసేన అధినేత పవన్ కల్యాణ్ వీరిద్దరికీ మద్దతుగా ప్రచారం చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విశాఖ కేంద్రంగా రైల్వే జోన్, వెనుకబడిన ఉత్తరాంధ్రకు మరింత మెరుగైన ప్యాకేజీ వంటి అంశాలతో విస్తృత ప్రచారం చేశారు. ఉత్తరాంధ్రకు సంబంధించి ఐదు పార్లమెంట్ స్థానాల్లో నాలుగింటిని, 34 అసెంబ్లీ స్థానాల్లో 25 సెగ్మెంట్లను మిత్రపక్షాలు గెలుచుకున్నాయి. విపక్షం ఒక ఎంపి స్థానంతో పాటు తొమ్మిది అసెంబ్లీ సెగ్మెంట్లకే పరిమితమైంది. విభజనతో జరిగిన అన్యాయం సరిదిద్దాలంటే కేంద్రంలో బిజెపి, రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడపాలంటే టిడిపిలకే సాధ్యమని ప్రజలు విశ్వసించారు. దీంతో టిడిపి, బిజెపిలకే ప్రజలు పట్టం కట్టారు. ఎన్నికలు జరిగి కేంద్రం బిజెపి, రాష్ట్రంలో టిడిపి ఉమ్మడి ప్రభుత్వాలు ఏర్పాటై మూడేళ్లు కావస్తోంది. అయితే జాతీయ స్థాయి విద్యా సంస్థల ఏర్పాటు మినహా ప్రత్యేక హోదా, రైల్వే జోన్, ప్యాకేజీ వంటి అంశాలు హామీలుగానే మిగిలి పోయాయి. ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదని, ప్రత్యేక ప్యాకేజీని కేంద్రం ప్రకటించగా, గత్యంతరం లేని పరిస్థితుల్లో టిడిపి అంగీకరించింది. కేంద్ర నిర్ణయంతో ప్రత్యేక హోదా ఉద్యమానికి ఆజ్యం పోసినట్టైంది. ఇక విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ విషయంలోనూ కేంద్రం ఇప్పటికీ నాన్పుడుధోరణినే అనుసరిస్తోంది. రైల్వే శాఖను నిర్వహిస్తున్న సురేష్ ప్రభును రాష్ట్రం నుంచి రాజ్యసభకు ఎంపిక చేసినప్పటికీ జోన్ సహా పలు అంశాల్లో రాష్ట్రానికి ఒరిగిందంటూ ఏమీ లేదు. విశాఖకు రైల్వే జోన్ ప్రకటించే విషయంలో కొన్ని సాంకేతికాంశాలను సాకుగా చూపుతూ కేంద్రం ప్రకటన వాయిదా వేస్తూ వస్తోంది. ప్యాకేజీ ద్వారా 24వేల కోట్ల మేర ఆర్థిక సాయం అందుతుందని భావించిన వెనుకబడిన జిల్లాలకు కూడా నిరాశే ఎదురైంది. కేవలం రూ.1000కోట్లతో సరిపెట్టేశారు.
ఈ అంశాలన్నింటినీ విపక్ష పార్టీలు ఇప్పటికే విస్తృత ప్రచారం చేస్తున్నాయి. ప్రజల మద్దతు కూడగట్టే విషయంలో విపక్షాలతో పాటు అప్పట్లో టిడిపి, బిజెపిల తరపున ప్రచారం చేసిన జనసేన కూడా ఉద్యమానికి సన్నద్ధం అవుతోంది. ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్ర పట్ట్భద్రుల ఎమ్మెల్సీ స్థానం నుంచి పోటీ చేస్తున్న మిత్రపక్ష బిజెపి అభ్యర్థి తరపున ఎన్నికల ప్రచారం చేసేందుకు టిడిపి వర్గాలు సాహసించలేకపోతున్నాయి. సామాన్య జనానికైతే ఏదో చెప్పి ఓట్లేయించుకోగలం కానీ, చదువుకున్న మేథావులకు ప్రత్యేక హోదా, రైల్వే జోన్, అభివృద్ధి ప్యాకేజీ వంటి అంశాల్లో వైఫల్యాలను ఏ విధంగా నచ్చచెప్పగలమని తమ్ముళ్లు వాపోతున్నారు. నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలను బాధ్యులు చేయగా, వారు కింది స్థాయి కేడర్‌పై బాధ్యతలు పెట్టి తప్పించుకుంటున్నారు. నామినేషన్ల ప్రక్రియ పూర్తయి, నేడో,రేపో పూర్తి స్థాయి ప్రచారంలో దూసుకెళ్లాల్సిన తరుణంలో బిజెపి అభ్యర్థికి తోడుగా తమ్ముళ్లు ఎన్నికల ప్రచారం సాగించే సాహసం చేస్తారా అన్నది అనుమానస్పదంగానే కన్పిస్తోంది.