ఆంధ్రప్రదేశ్‌

28నే ఉగాది నిర్వహించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 17: వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును పంచాంగకర్త గార్గేయ సిద్ధాంతి, కంచికామకోటి పీఠం సిద్ధాంతి ఎల్ సుబ్రహ్మణ్యం, హనుమంత వజ్జల సుబ్రహ్మణ్యం కలిశారు. అనేక రాష్ట్రాల్లో ఈ నెల 28న ఉగాది వేడుకలు నిర్వహిస్తున్నారని, నాసా చెప్పిన పద్ధతిలో 29న పాడ్యమి లేదని ముఖ్యమంత్రికి గార్గేయ వివరించారు. మన రాష్ట్రంలోనూ 28న నిర్వహించాలని సూచించారు. జైన్ శే్వతాంబర సభ ప్రతినిధి దినేష్ జైన్ కూడా చంద్రబాబును కలిశారు. అమరావతిలో జైనుల పాఠశాలకు, జైనుల ప్రార్థనా మందిరానికి స్థలం కేటాయించాలని కోరారు. ఆత్మహత్య చేసుకున్న మెడికో బాల సంధ్యారాణి తండ్రి సత్తయ్య ముఖ్యమంత్రిని కలిసి తమను ఆదుకోవాలని కోరారు. చంద్రబాబు రెండు లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని మంజూరు చేశారు.