ఆంధ్రప్రదేశ్
ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి పెద్ద పీట
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
రాజమహేంద్రవరం, మార్చి 19: ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేసిందని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ కారెం శివాజీ చెప్పారు. రాజమహేంద్రవరం ఆర్ అండ్ బి అతిధి గృహంలో ఆదివారం జరిగిన విలేఖర్లతో మాట్లాడారు. రెండు దశాబ్దాల ఉద్యమ స్ఫూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ ఛైర్మన్గా నియమించిందని, కొన్ని సాంకేతిక కారణాలవల్ల సమస్య ఎదురైనప్పటికీ మళ్ళీ తన నియామకం జరిగిందన్నారు. తన నియామకానికి సహకరించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, లోకేష్కు, మంత్రులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు. ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి కమిషన్ కట్టుబడి వుందని, ఇటీవల బడ్జెట్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ వర్గాల పట్ల అంకితభావం తేటతెల్లమైందని శివాజీ పేర్కొన్నారు. శిరోముండనం కేసు కోర్టు పరిధిలో వుందని, బాధితులు కోరితే కమిషన్ తరపున సహాయం అందించడం జరుగుతుందన్నారు. ఈ కేసు ఎస్సీ, ఎస్టీ కమిషన్ పరిధిలోకి రాదని ఒక ప్రశ్నకు సమాధానంగా శివాజీ చెప్పారు. రాజధాని అమరావతిలో అంబేద్కర్ స్మృతి వనం, దేశంలోనే అతి పెద్ద అంబేద్కర్ విగ్రహం నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. ఎస్సీ సబ్-ప్లాన్లో రూ.9780 కోట్లు, గిరిజన సబ్- ప్లాన్లో రూ.3587 కోట్లు, క్రైస్తవ కార్పొరేషన్కు రూ.35కోట్లు, జెరూసలేం వెళ్లడానికి నిధులు కేటాయించారన్నారు. దళిత, గిరిజనుల ఇప్పటి వరకు 50 యూనిట్లలోపు ఉచిత విద్యుత్తు కాస్తా ఇపుడు 70 యూనిట్లకు పెంచడం జరిగిందన్నారు. సంక్షేమ రంగానికి అత్యధిక నిధులు కేటాయించడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ కృషివల్ల ప్యాకేజీకి చట్టబద్ధత లభించిందని, కేంద్రానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. దళిత గిరిజనులు సంక్షేమానికి గతంకంటే రెట్టింపు ఉత్సాహంతో పనిచేయడం జరుగుతుందన్నారు. దళిత, గిరిజనులను వ్యాపారులుగా తీర్చిదిద్దడానికి, వారి సంక్షేమానికి శక్తివంచన లేకుండా కమిషన్ కృషి చేస్తుందన్నారు. వారి రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్ డైరెక్టర్ రాజారావు మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి సక్రమంగా పనిచేయని అధికారులను కూడా కమిషన్ ఉపేక్షించదన్నారు. పదవి చేపట్టిన తర్వాత తొలి సారిగా రాజమహేంద్రవరం వచ్చిన ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ శివాజీకి వేమగిరి జంక్షన్ నుంచి ఘన స్వాగతం పలికారు. రాజమహేంద్రవరం ఆర్ అండ్ అతిధి గృహంలో ఎస్సీ, ఎస్టీల సమస్యలపై వినతి పత్రాలు స్వీకరించి సమీక్షించారు.
చిత్రం..విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న కారెం శివాజీ