ఆంధ్రప్రదేశ్‌

వ్యాక్సిన్ వేసిన మర్నాడే మూడు నెలల చిన్నారి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మారేడుమిల్లి, ఏప్రిల్ 20: పలు వ్యాధుల నుండి రక్షణ కల్పించే పెంటా వాలెట్ వ్యాక్సిన్ వేసిన మర్నాడే మూడు నెలల చిన్నారి మృతిచెందాడు. తూర్పు గోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతం మారేడుమిల్లి మండలంలో గురువారం ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. ఈ మరణానికి కారణంపై అధికారులు విచారణ జరుపుతున్నారు. వివరాల్లోకి వెళితే... మారేడుమిల్లి మండలం జిఎం వలస గ్రామానికి చెందిన కలుముల చిరంజీవిదొర, రాములమ్మ దంపతులకు మూడు నెలల క్రితం మగ శిశువు జన్మించాడు. బుధవారం ఉదయం 10గంటలకు ఆరోగ్య సిబ్బంది ఈ చిన్నారికి పెంటావాలెట్ వ్యాక్సిన్ వేశారు. అయితే గురువారం తెల్లవారుజామున శిశువుకు వాంతులు, విరేచనాలు కావడంతో తల్లిదండ్రులు మారేడుమిల్లి పిహెచ్‌సికి తీసుకువచ్చారు. అయితే శిశువు అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు గుర్తించారు. చిన్నారి మృతికి గల కారణాలపై సంబంధిత శాఖాధికారులు విచారణ చేపట్టారు.