ఆంధ్రప్రదేశ్‌

గొడవంతా గొంతెమ్మ కోర్కెలతోనే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, ఏప్రిల్ 21: : తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేలు, ఎంపీల అసంతృప్తికి అసలు కారణమేమిటి.. ఎన్నికలకు రెండేళ్ల ముందు వారంతా ఎందుకు వ్యూహాత్మకంగా పార్టీని ఇరుకున పెడుతున్నారు.. వారి ఒత్తిళ్లకు కాంట్రాక్టర్ల నుంచి వచ్చే కమీషనే్ల కారణమా.. పార్టీ అధినేత చంద్రబాబునాయుడు మొహమాటమే ఈ పరిస్థితికి కారణమా.. సీఎంఓ ఉన్నతాధికారి ఈ విషయంలో ప్రజాప్రతినిధులను సమన్వయం చేసుకోవడంలో విఫలమవుతున్నారా.. అటు బలమైన ప్రతిపక్షమైన వైసీపీతో పోరాటం, ఇటు రాష్ట్భ్రావృద్ధి, అమరావతి నిర్మాణం, మరోవైపు కేంద్రం నుంచి వచ్చే నిధులు, తదితర కీలక అంశాలపై దృష్టి సారిస్తున్న చంద్రబాబునాయుడికి పదవులు ఆశిస్తున్న నేతలతోపాటు, గొంతెమ్మ కోర్కెలతో వస్తున్న ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లు శిరోభారంగా పరిణమించాయి. స్వతహాగా మొహమాటస్థుడు, ఎవరినీ ఒదులుకోలేని బలహీనత ఉన్న బాబు కొనసాగిస్తున్న ఈ వైఖరి, చివరకు ఎమ్మెల్యేలలో అసంతృప్తికి దారితీస్తోందని సీనియర్లు విశే్లషిస్తున్నారు. గత కొద్దికాలం నుంచి పార్టీలో వినిపిస్తున్న అసంతృప్తి స్వరాలకు అసలు కారణం వేరే ఉందని నేతలు చెబుతున్నారు. నియోజకవర్గాల్లో అభివృద్ధి కార్యక్రమాల పేరిట బాబును కలుస్తున్న ఎమ్మెల్యేలు కనీసం వంద కోట్ల రూపాయలకు మించకుండా ప్రతిపాదనలు తెస్తున్నారని, మరికొందరయితే ఏకంగా మూడువందల కోట్ల ప్రతిపాదనలు తీసుకువస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆ ప్రతిపాదనలు చూసి బిత్తరపోతున్న బాబు, అవుననకుండా.. కాదనకుండా సీఎంఓ ఉన్నతాధికారికి ఇవ్వమని చెబుతున్నారు. అయితే ఆ అధికారి ఆ పనులు అవుతాయా.. కావా అనేది అప్పుడే చెప్పకుండా నాన్చుడు వైఖరి అవలంబిస్తుండటంతో, అదే పని కోసం ప్రజాప్రతినిధులు నాలుగైదుసార్లు బాబు, సీఎంఓ చుట్టూ తిరగాల్సి వస్తోందంటున్నారు. అదే ఆ పనులు చేయడం సాధ్యం కాదని, అంత బడ్జెట్ ప్రభుత్వం వద్ద లేదని ముందే చెబితే అసంతృప్తి మొదలయ్యే అవకాశం ఉండదని సీనియర్లు విశే్లషిస్తున్నారు. ఒక పని కోసమే నాలుగైదు సార్లు తిరుగుతుండటంతో అసహనం పెరిగిన ఎమ్మెల్యేలు, పార్టీ నాయకత్వంపై అసంతృప్తి పెంచుకుంటున్నారని చెబుతున్నారు. అయితే, అభివృద్ధి కార్యక్రమాల పేరిట తీసుకువస్తున్న ప్రతిపాదనల వెనుక అసలు మతలబు వేరే ఉందంటున్నారు. నియోజకవర్గాల స్థాయిని బట్టి ఒక్కో ఎమ్మెల్యే కాంట్రాక్టర్ల నుంచి 2 నుంచి 5 శాతం వరకూ కమీషన్లు తీసుకుంటున్నారని, ఈ విషయంలో ప్రకాశం జిల్లాలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యే ఒకరు, అత్యధిక శాతం కమీషన్లు తీసుకుంటున్నారని ఓ సీనియర్ నేత వెల్లడించారు. ఈ రకంగా తాము అభివృద్ధి పనుల కోసమే ఒత్తిడి చేస్తున్నామే తప్ప, తమ సొంత పనుల కోసం కాదు కదా అని ఎమ్మెల్యేలు వాదిస్తున్నా, అసలు రహస్యం మాత్రం ఇదేనంటున్నారు. ఇవి కాకుండా చాలామంది ఎమ్మెల్యేలు తీసుకువస్తున్న ప్రతిపాదనలు స్థానికంగా పార్టీ-ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చిపెట్టేలా ఉంటున్నాయని, వాటిని ఆమోదిస్తే ప్రజల్లో ప్రభుత్వంతోపాటు, బాబు ఇమేజ్ కూడా దెబ్బతినే ప్రమాదం ఉందని చెబుతున్నారు. ఉదాహరణకు రాష్ట్రంలో జరుగుతున్న కేంద్రప్రభుత్వ పనులను కూడా కొందరు అడ్డుకుంటున్నారని, దానివల్ల ప్రభుత్వం-పార్టీకి చెడ్డపేరు వస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యేలు సిఫార్సు చేస్తున్న వారికే బదిలీలు, పోస్టింగులు, ఇతర పనుల్లో ప్రాధాన్యం ఇస్తున్నా, అవి సరిపోక గొంతెమ్మ కోర్కెలు కోరుతున్నారని సీనియర్లు వివరిస్తున్నారు.
గుంటూరు జిల్లాలో ఒక ఎమ్మెల్యే ఇసుక, మైనింగ్ వ్యవహారాల్లో పెత్తనం చేస్తున్నారని, మళ్లీ ఆయనే పార్టీపై ఒత్తిడి తీసుకువస్తున్నారని, ఇలాంటి ఎమ్మెల్యేలు ఆయా జిల్లాల్లో పోలీసు, రెవిన్యూ, మైనింగ్ వ్యవహారాల్లో చక్రం తిప్పి ఆర్థికంగా లాభపడుతూ కూడా, సొంత అజెండాలతో పార్టీని ఇబ్బందిపెట్టడం ఏమిటని మరో నేత వ్యాఖ్యానించారు. అయితే ఎమ్మెల్యేలు తీసుకువచ్చే ప్రతిపాదనల్లో సాధ్యాసాధ్యాలను అప్పటికప్పుడే చెప్పకపోవడం, బాబు కూడా వాటిని సీఎంఓకు ఇవ్వడం వల్ల ఎమ్మెల్యేలలో ఇద్దరిపైనా అసంతృప్తి పెరిగేందుకు కారణమవుతోందని, దానిని మార్చుకోకపోతే మరిన్ని ఇబ్బందులు తప్పవని విశే్లషిస్తున్నారు. ఇప్పటికే సీఎం రిలీఫ్ ఫండ్ (సిఎంఆర్‌ఎఫ్), పింఛన్ల మంజూరులో గతంలో ఏ సీఎం ఇవ్వనని నిధులు ఇస్తున్నా, ఎమ్మెల్యేలు సంతృప్తి చెందకపోవడంపై విస్మయం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా ఎమ్మెల్యేలు సిఫార్సు చేసే సీఎం రిలీఫ్ ఫండ్ విషయంలో దివంగత వైఎస్ కంటే బాబు ఎక్కువ నిధులు ఇస్తున్నారు. కనీసం ఒక్కో దరఖాస్తుదారుడికి 3-4 లక్షలు మంజూరు చేస్తున్నారు. గతంలో వైఎస్ లక్షరూపాయలు మంజూరు చేస్తే అదే చాలా ఎక్కువగా ఉండేదని, ఇప్పుడు బాబు 3-4 లక్షల నుంచి ఒక్కోసారి రోగి అవసరం బట్టి 7 లక్షల వరకూ ఇస్తున్న సందర్భాలున్నాయని గుర్తు చేస్తున్నారు. వృద్ధాప్య, వితంతు, వికలాంగుల పింఛన్లు నియోజకవర్గానికి 300 తక్కువ కాకుండా ఇస్తున్నా, అసంతృప్తి గళం విప్పుతున్నారంటే దానికి సొంత అజెండాలే కారణమంటున్నారు. ఈ వ్యవహారంలో బాబు, సీఎంఓ మొహమాటానికి తెరదించాల్సిన సమయం వచ్చిందని స్పష్టం చేస్తున్నారు.