ఆంధ్రప్రదేశ్‌

ఉనికి కోసమే జగన్ దీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, ఏప్రిల్ 30 : రాష్ట్ర రాజకీయాల్లో తానంటూ ఒకడిని ఉన్నానంటూ, తన ఉనికిని చాటుకునేందుకే వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి దీక్షలు చేస్తుంటారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. మంత్రి సోమిరెడ్డి ఆదివారం అనంతపురం నగరంలోని ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో చీఫ్ విప్ పల్లె రఘునాథరెడ్డి, ఎమ్మెల్సీ శమంతకమణి, ఎమ్మెల్యే సూర్యనారాయణతో కలిసి విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. సిఎం చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకుపోతుంటే, జగన్‌కు అది నచ్చడం లేదని వ్యాఖ్యానించారు. రాష్ట్రం పురోగతి సాధించడం ఆయనకు ఇష్టం లేదన్నారు. గుంటూరులో రెండు రోజుల దీక్ష ఎందుకు చేస్తున్నారో చెప్పాలన్నారు. సమస్యలు ఏవైనా ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురండి.. పరిష్కరిస్తాం.. అని సూచించారు. గుంటూరులో చేపట్టనున్న దీక్ష హింసకు దారి తీస్తే అందుకు వైకాపా, జగన్ బాధ్యత వహించాలని మంత్రి హెచ్చరించారు. రాష్ట్రంలో కోల్డ్ స్టోరేజీలు ఖాళీగా లేకపోవడం వల్లే నిల్వ ఉంచలేకపోతున్నామన్నారు. క్వింటాల్ మిర్చిని రూ. 1500 చొప్పున ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, రైతులు సంయమనం పాటించాలని మంత్రి కోరారు. అలాగే క్వింటాల్ పసుపు రూ. 6వేలతో కొంటున్నామన్నారు. ఇక సోషల్ మీడియాలో వైకాపానే కాదు టిడిపి వారైనా అసభ్యకర, అభ్యంతరకర పోస్టులు పెడితే బొక్కలో తోస్తామని హెచ్చరించారు. సోషల్ మీడియా వల్ల కుటుంబాలకు కుటుంబాలు నాశనమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.