ఆంధ్రప్రదేశ్‌

రచయిత దూసి ధర్మారావు దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఏప్రిల్ 30: విశాఖపట్నం బీచ్‌రోడ్డులో ఆదివారం రాత్రి జరిగిన ఘోర ప్రమాదంలో ప్రముఖ రచయిత దూసి ధర్మారావు దుర్మరణం చెందారు. ఆర్కే బీచ్‌లో ఆదివారం సాయంత్రం ఓ ప్రైవేట్ పాఠశాల బస్సు బ్రేకులు ఫెయిలయ్యాయి. నొవాటెల్ హోటల్ వైపు నుంచి బీచ్ రోడ్డుకు వస్తున్న బస్సు ఒక్కసారిగా బీచ్‌రోడ్‌పై ఉన్న సందర్శకులపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో బీచ్‌రోడ్‌లో బెంచ్‌పై కూర్చొ ని ఉన్న ధర్మారావును బస్సు ఢీకొట్టడంతో ఆయన అక్కడికక్కడే మరణించారు. మరో నలుగురు గాయపడ్డారు. శ్రీకాకుళానికి చెందిన ధర్మారావుప్రసిద్ధ రచయిత కాళీపట్నం రామారావు శిష్యుడు. అనేక రచనలు చేసిన దూసి ధర్మారావుసాహితీలోకానికి చిరపరిచితుడు.