ఆంధ్రప్రదేశ్‌

ఇక అవినీతిపై ప్రత్యక్ష యుద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 1: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అవినీతిపై యుద్ధానికి సిద్ధమయ్యారు. అవినీతికి పాల్పడే ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారుల్ని ఆదేశించారు. సోమవారం సచివాలయంలో ఉన్నతస్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. తమ ప్రభుత్వంలో అవినీతిని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమన్నారు. అవినీతిని అదుపులో ఉంచాలని.. ఇందుకోసం స్పెషల్ కోర్ట్స్ యాక్ట్‌ను రూపొందించాలన్నారు. అవినీతికి పాల్పడే ఉద్యోగులు, అధికారుల అక్రమాస్తులపై వచ్చిన ఫిర్యాదులను పూర్తిస్తాయిలో విచారించి.. ఆరోపణలు రుజువైతే.. ఆస్తులను జప్తుచేసి ప్రభుత్వానికి జమ చేయాలని ఆదేశించారు. ఇందుకోసం అవసరమైన నిబంధనలు రూపొందించి వాటిని అమలుచేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఉద్యోగుల బదిలీల్లో అవినీతికి ఆస్కారం ఉండరాదని.. ఒకవేళ ఎవరైనా అవినీతికి పాల్పడితే వారిపై కఠినచర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఉద్యోగుల పనితీరు ఆధారంగా మార్కులు కేటాయించాలని.. మెరిట్ ఆధారంగానే బదిలీలు జరగాలని.. ఈ విషయంలో పారదర్శకత ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ నివేదికలపై కూడా నిర్ణీత సమయంలోగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ విషయంలో ఎలాంటి జాప్యం జరక్కుండా ఉన్నతాధికారులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఏసిబి కేసుల్లో విచారణకు అనుమతివ్వడాన్ని ఉన్నతాధికారులు ఆలస్యం చేయరాదన్నారు. ఏ ఉద్యోగి, అధికారిపై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారించేందుకు సంబంధిత శాఖల ఉన్నతాధికారులు మూడు నెలల్లోగా అనుమతివ్వాలని ఆదేశించారు. లేనిపక్షంలో ఏసిబి డైరక్టర్ జనరల్ నేరుగా చార్జ్‌షీట్ ఫైల్ చేయడానికి అనుమతిచ్చినట్టే భావించాలన్నారు. సిటిజన్ చార్టర్, ఇంటర్నెట్ ద్వారా ఆన్‌లైన్ సర్వీసులను ఉపయోగించుకుని అవినీతి నిరోధానికి కృషి చేయడంతోపాటు ప్రజల్ని చైతన్యవంతుల్ని చేయాలని అధికారులకు సూచించారు. అవినీతి వ్యతిరేక ఉద్యమంలో భాగంగా కాల్‌సెంటర్, మీ కోసం, కైజాలా యాప్, సిఎం కనెక్ట్ వంటి సాధనాల ఆధారంగా ప్రజలు నేరుగా ప్రభుత్వంతో సంప్రదించాలని సూచించారు. ఈ ఆఫీస్ అమలులో భాగంగా ప్రతి ఫైల్ నిర్ణీత సమయంలోగా క్లియర్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారుల్ని ఆదేశించారు. ఏ ఫైల్ అయినా మూడు రోజుల్లోగా క్లియర్ చేసేలా ఉన్నతాధికారులు పరిశీలించి నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలలు, హాస్పిటల్స్, కార్యాలయాల్లో బయోమెట్రిక్ విధానం అమలుచేయడం ద్వారా.. పనుల్లో పురోగతి ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇంజనీరింగ్ వర్క్స్‌కు సంబంధించి నాణ్యత విషయంలో రాజీపడేది లేదన్నారు. ఉద్యోగుల అవినీతికి సంబంధించి నేరుగా ముఖ్యమంత్రికే ఫిర్యాదులు వస్తున్నాయని.. కాబట్టి ఉద్యోగులు విధి నిర్వహణ విషయంలో ఎలాంటి అలసత్వం ప్రదర్శించరాదని హెచ్చరించారు. ప్రజల్ని పీడిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదన్నారు. సమావేశంలో సిఎం ముఖ్య కార్యదర్శి సతీష్‌చంద్ర, ఏసిబి డైరక్టర్ జనరల్ ఆర్‌పి ఠాకూర్, హోంశాఖ ముఖ్య కార్యదర్శి అనురాధ, ఇంటెలిజెన్స్ చీఫ్ ఎబి వెంకటేశ్వరరావు, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.