ఆంధ్రప్రదేశ్‌

వాడి-గుంతకల్లు విద్యుదీకరణ త్వరలో పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదోని, మే 1: వాడి-గుంతకల్లు రైల్వేస్టేషన్ల మధ్య జరుగుతున్న రైల్వేలైన్ విద్యుదీకరణ పనులు త్వరలో పూర్తి చేస్తామని గుంతకల్లు రైల్వే డివిజనల్ మేనేజర్ అమితాబ్ ఓజా పేర్కొన్నారు. ఆదోని రైల్వేస్టేషన్‌ను సోమవారం తనిఖీచేసిన ఆయన అనంతరం విలేఖరులతో మాట్లాడారు. వాడి- గుంతకల్లు స్టేషన్ల మధ్య జరుగుతున్న విద్యుదీకరణ పనుల్లో పురోగతి ఉందన్నారు. ప్రస్తుతం సూగూరు వరకు విద్యుదీకరణ పనులు పూర్తయ్యాయన్నారు. త్వరలో మిగతా పనులు పూర్తి చేస్తామన్నారు. ఆదోని మోడల్ స్టేషన్ బి కేటగిరి కిందికి వస్తుందని, అందువల్ల తొలుత ఏ కేటగిరి స్టేషన్ల అభివృద్ధి తరువాత ఆదోని రైల్వేస్టేషన్ అభివృద్ధిపై దృష్టి సారిస్తామన్నారు. ఆదోని రైల్వేస్టేషన్ అభివృద్ధికి చర్యలు తీసుకుంటామన్నారు.