ఆంధ్రప్రదేశ్‌

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం సిటీ, ఏప్రిల్ 25: అనంతపురం జిల్లా శింగనమల మండలం పరిధిలోని లోలూరు క్రాస్ వద్ద సోమవారం తెల్లవారు జూమున జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మృతి చెందిన వారిలో డ్రైవర్ రవి(20), మంజునాథ్ (46), అతని భార్య మంజూషా(42)లు ఉన్నారు. కర్నాటక రాష్ట్రం గంగావతి గ్రామానికి చెందిన కె.మంజునాథ్ కుటుంబం తమ సమీప బంధువుల ఇంట్లో శుభకార్యానానికి కదిరికి వచ్చి తిరిగి వెళుతుండగా లోలూరు వద్ద వారు ప్రయాణిస్తున్న కారు రోడ్డు పక్కన ఉన్న డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ రవి (20) అక్కడిక్కడే మృతి చెందగా మంజునాథ్ (46), అతని భార్య మంజూషా (42) అనంతపురంలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.