ఆంధ్రప్రదేశ్‌

గంగుల అనుచరుల దారుణ హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శిరివెళ్ల, మే 6: కర్నూలు జిల్లా శిరివెళ్ల మండలం గోవిందపల్లెలో శనివారం సాయంత్రం జంట హత్యలు జరిగాయి. బావ-మరుదులను గుర్తుతెలియని వ్యక్తులు అత్యంత కిరాతకంగా నరికి చంపారు. గోవిందపల్లె గ్రామానికి చెందిన మాజీ మండలాధ్యక్షుడు ఇండ్లూరి ప్రభాకర్‌రెడ్డి (46), అతని బావమరిది శ్రీనివాసరెడ్డి(46)ని గుర్తుతెలియని వ్యక్తు లు వేటకొడవళ్లతో నరికి చంపారు. మృతులిద్దరూ ఎమ్మెల్సీ గంగుల ప్రతాపరెడ్డి అనుచరులు. సిఐ ప్రభాకర్‌రెడ్డి కథనం ప్రకారం శ్రీనివాసరెడ్డి, ప్రభాకర్‌రెడ్డి శనివారం సాయంత్రం వాకింగ్‌కు వెళ్లారు. మోచ్చలపల్లె రోడ్డు వరకు వెళ్లిన వారిపై అప్పటికే అక్కడ కాపుకాసిన ప్రత్యర్థులు వేటకొడవళ్లతో దాడి చేశారు. విచక్షణారహితంగా వేడకొడవళ్లతో నరకడంతో ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. విషయం తెలియగానే మృతుల కుటుంబసభ్యులు, బంధువులు, గ్రామస్తులు పెద్దసంఖ్యలో సంఘటనాస్థలానికి చేరుకున్నారు. సిఐ ప్రభాకర్‌రెడ్డి సిబ్బందితో సంఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టామని, నిందితులను త్వరలో పట్టుకుంటామని సిఐ తెలిపారు. పాతక్షక్షల నేపధ్యంలోనే ఈ జంట హత్యలు జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.