ఆంధ్రప్రదేశ్‌

మనలో ఒక్కొక్కరూ ఒక్కో బాహుబలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచానికి మనం ఆదర్శం కావాలి
ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపు
శాన్‌హోజ్‌లో ఉత్తేజభరిత ప్రసంగం

విజయవాడ, మే 8: తెలుగువారు ఒక్కొక్కరు ఒక్కో బాహుబలి కావాలని, తెలుగుజాతి ప్రపంచానికే ఆదర్శం కావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆకాంక్ష వ్యక్తం చేశారు. ఇవాళ ప్రపంచం మొత్తం ఎక్కడ చూసినా తెలుగువాళ్లు ఉన్నారని, తెలుగు జాతికి కష్టపడే తత్వం, ఎక్కడైనా పనిచేయగల సామర్థ్యం ఉందని అన్నారు. అమెరికా పర్యటనలో భాగంగా నాలుగోరోజు శాన్‌హోజ్‌లో పర్యటించిన ముఖ్యమంత్రి అక్కడ ప్రవాస తెలుగువారి సమావేశంలో పాల్గొని ఉత్తేజ భరితంగా ప్రసంగించారు. అమెరికాలో ఇంతమంది తెలుగువారిని చూస్తుంటే అమరావతిలో ఉన్నానో, అమెరికాలో ఉన్నానో తెలియడం లేదని ముఖ్యమంత్రి చమత్కరించారు. ప్రపంచాన్ని జయించవచ్చని తెలుగువాళ్లు నిరూపించారని, తెలుగు జాతికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు రావాలన్నదే తన లక్ష్యమని చెప్పారు. తెలుగు బిడ్డ రాజవౌళి బాహుబలి వంటి బ్రహ్మాండమైన సినిమా తీశారని, ప్రపంచం మొత్తం 9వేల థియేటర్లలో సినిమాను ప్రదర్శించడం గర్వకారణమని, రాజవౌళిని చూస్తే తెలుగువాడి సత్తా తెలుస్తోందని అన్నారు. ప్రతి తెలుగువారు కొత్తగా ఆలోచించి నూతన ఆవిష్కరణలు చేయాలని, ఉక్కు సంకల్పం ఉంటే సాధించలేనిది ఏదీ ఉండదని పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్‌కు విభజన కొత్త సమస్యలు తెచ్చి పెట్టిందని అన్నారు. కష్టాలు తాత్కాలికమే అన్న ముఖ్యమంత్రి వెయ్యి కిలోమీటర్ల తీర ప్రాంతం, సహజ వనరులు, సృజనశీలురైన మానవ వనరులు మన సొంతమన్నారు. ఒంగోలు గిత్తలు మన బలం-కూచిపూడి మన ఘన వారసత్వంగా చెప్పారు. ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టును అనుకున్న సమయానికి పూర్తిచేసి తీరతామని చెప్పారు. నదుల అనుసంధానం గురించి ఎన్నో ఏళ్లుగా మాట్లాడుతున్నా, దాన్ని మనమే సాధ్యం చేశామన్నారు. స్వల్పకాల, దీర్ఘకాల లక్ష్యాలు ఏర్పాటు చేసుకుని రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో పరుగులు పెట్టిస్తున్నామని ముఖ్యమంత్రి చెప్పారు. వీధుల్లో ఎల్‌ఈడి బల్బులు ఏర్పాటు చేసి దేశానికి ఆదర్శంగా నిలిచామని, ఫైబర్ గ్రిడ్ ఒక వినూత్న ఆలోచన అంటూ ప్రభుత్వ విజయాలను వివరించారు. మహిళలు, పురుషులు సమానంగా పనిచేయాలి, సమంగా సంపాదించాలి అనే ఉద్దేశంతో డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేశామన్నారు. మహిళా సాధికారత కోసం తాము ఎంతో కృషి చేస్తున్నామన్నారు.
ప్రపంచంలోని ఐదు అత్యున్నత నగరాల్లో అమరావతి ఒకటిగా ఉండేలా, ప్రపంచమే గర్వపడేలా అమరావతి రాజధాని నిర్మాణం చేసుకోవాల్సి ఉందని అన్నారు. 2050కి కాలిఫోర్నియాతో పోటీపడేలా అమరావతి రూపుదాల్చడం తథ్యమని చెప్పారు. రాజధాని నిర్మాణానికి డబ్బుల్లేవు కానీ ప్రపంచశ్రేణి నగరం నిర్మించాలన్న పట్టుదల, సంకల్పం ఉందన్నారు. రాజధాని ముహూర్త బలం బాగుందని, అమరావతి నగరం భావితరాలకు మనమిచ్చే ఒక కానుకగా చెప్పారు.
సిస్కో చైర్మన్ జాన్ ఛాంబర్‌తో పరిచయం 20 ఏళ్లుగా కొనసాగుతోందని, బిల్‌గేట్స్‌ను ఒప్పించి మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ వచ్చేలా కృషి చేశానని ముఖ్యమంత్రి గుర్తు చేసుకున్నారు. ఇక్కడ ఐటీ ఉద్యోగాలతో మీరు సరిపెట్టుకోకుండా అత్యధిక శాతం మంది పారిశ్రామికవేత్తలుగా ఎదిగారంటూ ప్రవాస తెలుగువారిని కొనియాడారు. ఇప్పటికే మీరంతా ఒక స్థాయికి చేరుకున్నారని, తర్వాత దశకు ఎదగాలని అభిలషించారు. మీరు సంపాదించిన దాంట్లో కొంత రాష్ట్భ్రావృద్ధికి ఖర్చు చేయాల్సిందిగా కోరారు. చరిత్ర ఉన్నంత వరకు తెలుగువారి గుండెల్లో నిలిచే ఏకైక వ్యక్తి ఎన్టీఆర్ అని, తెలుగువారి ఆత్మ గౌరవాన్ని ప్రపంచానికి చాటారని ముఖ్యమంత్రి కీర్తించారు. కాలిఫోర్నియాకు చెందిన పలువురు రాజకీయ ప్రముఖులు ముఖ్యమంత్రితో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. శాన్‌హోజ్ మేయర్ సామ్‌లికార్డో, కాంగ్రెస్ ప్రతినిధి రో ఖన్నా, సెనేటర్ బాబ్ వెల్‌కౌస్కీ, అసెంబ్లీ సభ్యులు కాన్సాన్ చు, ఆష్ కల్రా ముఖ్యమంత్రిని కలిసినవారిలో ఉన్నారు. ముఖ్యమంత్రి బృందంలో ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు, ప్రభుత్వ సలహాదారు డాక్టర్ పరకాల ప్రభాకర్, ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి గుట్టుపల్లి సాయిప్రసాద్, ఆర్థిక అభివృద్ధి మండలి కార్యనిర్వాహక అధికారి జాస్తి కృష్ణకిషోర్, సిఆర్‌డిఎ ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన్, ఐటీ ముఖ్య కార్యదర్శి కావేటి విజయానంద్, పరిశ్రమల శాఖ కార్యదర్శి సోల్మన్ ఆరోఖ్యరాజ్ ఉన్నారు.

చిత్రం... శాన్‌హోజ్‌లో తెలుగువారితో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతున్న సిఎం చంద్రబాబు