తెలంగాణ

రెండు లారీలు ఢీ: డ్రైవర్లు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కల్లూరు, ఏప్రిల్ 28: ఖమ్మం జిల్లా కల్లూరు మండలం రామకృష్ణాపురం గ్రామ సమీపాన గురువారం ఉదయం రాష్ట్రీయ ప్రధాన రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు లారీ డ్రైవర్లు మృతి చెందారు. ఈ విషయమై ఎస్సై పి సర్వయ్య తెలిపిన వివరాల ప్రకారం నల్గొండ జిల్లా కట్టంగూర్ మండలం ఐటి పాయల గ్రామానికి చెందిన సింగారపువెంకన్న (25) సుద్ద లోడు లారీతో సత్తెనపల్లి వైపు వెళుతున్నాడు. నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమనేడు గ్రామానికి చెందిన ఆకుల రాజు మొక్కజొన్న లోడు లారీతో ఖమ్మం వైపు వెళుతున్నాడు. ఈ రెండు లారీలు ఉదయం గ్రామ సమీపాన ఎదురెదురుగా ఢీ కొనడంతో లారీలో ఉన్న డ్రైవర్లు ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదంలో లారీల క్యాబిన్లు నుజ్జునుజ్జు అవడంతో డైవర్లు సంఘటన స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. ఘటనతో మూడు గంటల పాటు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది.