ఆంధ్రప్రదేశ్‌

జగన్‌కు అమిత్‌షా ఫోన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 19: ఎన్‌డిఏ రాష్టప్రతి అభ్యర్థిగా రామ్‌నాథ్ కోవింద్ ఎంపిక పూర్తయిన మరుక్షణమే బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా సోమవారం రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌కు ఫోన్ ద్వారా ఆ విషయాన్ని తెలియపరిచారు. వెంటనే జగన్ స్పందిస్తూ అత్యున్నత పదవికి అత్యున్నత ఎంపిక అంటూ తప్పక మద్దతు నివ్వగలనన్నారు. కొద్దిరోజుల క్రితమే జగన్ ఢిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్రమోదీని కలిసి ఎన్‌డిఎ ఎంపిక చేసిన రాష్టప్రతి అభ్యర్థికి మద్దతు నివ్వగలమంటూ ముందుగా ప్రకటించిన విషయం విదితమే.