ఆంధ్రప్రదేశ్
నేపాల్లో చిక్కుకున్న 21 మంది రాష్ట్ర యాత్రికులు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 23 June 2017
విజయవాడ, జూన్ 22: మానస సరోవర్ యాత్రకు వెళ్లిన 21 మంది రాష్టవ్రాసులు నేపాల్లో చిక్కుకున్నారు. సమాచారం తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించి, ఢిల్లీలోని ఎపి భవన్ అధికారులతో గురువారం మాట్లాడారు. తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని అక్కడి అధికారులను ఆదేశించారు. ఖాట్మాండ్లోని భారత రాయబార కార్యాలయం అధికారులతో ఎపి భవన్ అధికారులు సంప్రదింపులు జరిపారు. వారిని శుక్రవారం విమానంలో ఢిల్లీకి తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. వారు ప్రస్తుతం నేపాల్లో ఒక హోటల్లో సురక్షితంగా ఉన్నట్లు ఇక్కడి అధికార వర్గాలు తెలిపాయి.