ఆంధ్రప్రదేశ్‌

రాజకీయ లబ్ధి కోసమే వైకాపా ధర్నా: కెఇ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 22: రాష్ట్రాన్ని దోచుకొని 11 కేసుల్లో ఎ1, ఎ2 నిందితులుగా ఉన్న వాళ్లా ప్రజలకు మేలు చేసేది.. ప్రతిపక్ష పార్టీ జిమ్మిక్కులను విశాఖ ప్రజలు నమ్మే పరిస్థితి లేదని డిప్యూటీ సిఎం కెఈ కృష్ణమూర్తి విమర్శించారు. కిరాయి మనుషులను తరలిస్తూ మహాధర్నా పేరుతో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ డ్రామాలు చేస్తున్నారని గురువారం ఒక ప్రకటనలో విమర్శించారు. రాజకీయ లబ్ధి కోసమే ప్రతిపక్ష పార్టీ విశాఖలో ధర్నా చేపట్టిందన్నారు. విశాఖ భూ ఆక్రమణలపై సమగ్రంగా విచారణ జరిపి, సూత్రధారులను ఆధారాలతో పట్టుకోవాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వ సిట్‌ని ఏర్పాటు చేసిందన్నారు. ధర్నాల పేరుతో సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురిచేయవద్దని, ప్రజలకు మేలు చేయాలనుకుంటే భూ ఆక్రమణలకు సంబంధించి ఆధారాలను సిట్‌కి అందజేయాలన్నారు. సిట్ విచారణ పూర్తయితే ప్రతిపక్ష పార్టీ ఆరోపణలు అబద్దమని తేలతాయనే ఉద్దేశంతో ప్రజలకు నిజాలు తెలియకూడదని ప్రతిపక్ష నాయకుడు విచారణను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. 2004 నుంచి జరిగిన భూ కబ్జాలపై విచారణ జరుగుతుందని, నిందితుల విషయంలో కఠినంగా వ్యవహరించి, బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇస్తున్నానన్నారు.