ఆంధ్రప్రదేశ్
ఇక తెల్లకార్డే ఆదాయ ధ్రువీకరణ పత్రం!
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
విజయవాడ, జూన్ 23: తెల్ల రేషన్ కార్డునే ఆదాయ ధ్రువీకరణ పత్రంగా ఇకపై వ్యవహరిస్తారు. ఈ మేరకు ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. పాఠశాలల్లో ప్రవేశం, ఫీజు రీ-యింబర్సుమెంట్, ఉపకార వేతనాలు, వివిధ కార్పొరేషన్ల నుంచి రుణం, వివిధ ప్రభుత్వ పథకాలు పొందేందుకు ఆదాయ ధ్రువీకరణ పత్రాలను దాఖలు చేయాల్సి వస్తున్నది. ధ్రువపత్రాలను పొందడంలో అర్జీదారులు, జారీలో రెవెన్యూ యంత్రాంగం ఇబ్బందులు పడుతున్న వైనం ప్రభుత్వం దృష్టికి వచ్చింది. దీంతో తెల్లకార్డు ఉంటే అదే బిపిఎల్ కుటుంబాలకు ఆదాయ ధ్రువీకరణ పత్రంగా ప్రభుత్వం స్పష్టం చేసింది. బిపిఎల్ కేటగిరి కంటే ఆదాయం ఎక్కువగా ఉన్న సందర్భాల్లో మొదటి సారి ఆ ఆదాయ ధ్రువీకరణ పత్రాన్ని తనిఖీ చేసి తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది. రెన్యూవల్ సమయంలో మరోసారి ఆ పత్రాన్ని అడగకూడదు. ఆదాయ ధ్రువీకరణ పత్రాలు జారీ చేసిన తేదీ నుంచి నాలుగు సంవత్సరాలు చెల్లు బాటు అవుతాయి. తెల్లకార్డు ఉన్న వారు బిపిఎల్ కేటగిరి కిందకు వస్తారు. వేరే ఆదాయ ధ్రువీకరణ పత్రం అవసరం ఉండదని ఉత్తర్వుల్లో పేర్కొంది.