ఆంధ్రప్రదేశ్‌

పింఛనుదారులతో బాలయ్య భోజనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందూపురం, జూన్ 25: అనంతపురం జిల్లా హిందూపురంలో ఆదివారం నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే బాలకృష్ణ పింఛనుదారులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. ఇటీవల నియోజకవర్గ వ్యాప్తంగా 3500 మందికి వివిధ రకాల పింఛన్లు మంజూరయ్యాయి. దీంతో స్థానిక ఎంజిఎం ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఎమ్మెల్యే బాలయ్య పాల్గొన్నారు. అలాగే పింఛను లబ్ధిదారులతో ఏర్పాటుచేసిన సహపంక్తి భోజనంలో బాలకృష్ణ భోజనం చేయడంతో పాటు వృద్ధులకు స్వయానా మిఠాయిలు తినిపించారు.
కాగా వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మైలవరం నుంచి పోటీ చేస్తారా అన్న ఊహాగానాలపై బాలకృష్ణను అడగ్గా దాట వేసే ధోరణితో వ్యవహరించారు.

చిత్రం.. సహపంక్తి భోజనంలో వృద్ధురాలికి మిఠాయి తినిపిస్తున్న ఎమ్మెల్యే బాలయ్య