ఆంధ్రప్రదేశ్‌

రాయలసీమలో జనసేన మలివిడత ఎంపికలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 27: జనసేన ఔత్సాహికుల వేదిక ఆధ్వర్యంలో ప్రతిభా పాటవ ఎంపిక శిబిరాలు కర్నూలు, కడప, చిత్తూరు జిల్లాల్లో ప్రారంభం కానున్నాయి. ఈ మూడు జిల్లాల నుంచి సుమారు 5,500 దరఖాస్తులు ఆన్‌లైన్ ద్వారా పార్టీ కార్యాలయానికి అందాయి. యువతీ యువకులు, మేధావులను క్రియాశీలక రాజకీయాల్లో భాగస్వాములను చేసి తద్వారా ఒక బలమైన పౌర సమాజం నిర్మించాలన్న ఆశయంతో జనసేన ఈ ఎంపిక శిబిరాలను నిర్వహిస్తోంది. ఒక్కో జిల్లాలో రెండు రోజులపాటు ఈ వేదిక కొనసాగుతుంది. ఈనెల 29, 30 తేదీల్లో కర్నూలులో, ఈనెల 30, జూలై 1న కడప, జూలై 2,3న చిత్తూరులోను ఈ శిబిరాలు జరుగుతాయి. ఈ మూడు జిల్లాల వారు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు పంపే గడువు మంగళవారం రాత్రితో ముగుస్తుంది. ఆన్‌లైన్‌లో దరఖాస్తులు పంపించలేకపోయినవారు వేదిక ప్రాంగణంలో తమ పేర్లు, వివరాలు నమోదు చేసుకుని ఈ శిబిరంలో పాల్గొనవచ్చని ఒక ప్రకటనలో తెలిపారు.