ఆంధ్రప్రదేశ్‌

కలియుగంలో నామ సంకీర్తన మోక్షదాయకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జూన్ 27: కలియుగంలో నామ సంకీర్తన ఒక్కటే మోక్షదాయకమని ఉడిపి పుత్తిగెమఠాధిపతి సుగుణేంద్ర తీర్థస్వామి అన్నారు. టిటిడి దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం మంగళవారం తెల్లవారుజామున తిరుపతిలోని అలిపిరి పాదాలమండపం వద్ద వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా స్వామిజీ భక్తులకు అనుగ్రహభాషణం చేస్తూ కాలినడకన తిరుమల గిరులను అధిరోహించి స్వామివారిని దర్శించుకోవడం ద్వారా ఆధ్యాత్మిక చైతన్యం పొందడమే మెట్లోత్సవం అంతరార్థమన్నారు. పూర్వం యోగులు, మునులు, రామానుజాచార్యులు, అన్నమాచార్యులు వంటి మహనీయులెందరో భక్తిప్రపత్తులతో తిరుమల కొండలను అధిరోహించి స్వామివారి వైభవాన్ని దశదిశలా వ్యాప్తిచేశారని వివరించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రా, తెలంగాణ, కర్నాటక రాష్ట్రాలకు చెందిన భజన మండలి సభ్యులు పాల్గొన్నారు.