ఆంధ్రప్రదేశ్‌

మంత్రిని బ్లాక్‌మెయిల్ చేసిన వ్యక్తి అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు, మే 7: రాష్ట్ర అటవీశాఖా మంత్రి బొజ్జల గోపాల క్రిష్ణా రెడ్డిని బ్లాక్ మెయిల్‌కు పాల్పడ్డ వ్యక్తిని చిత్తూరు వన్ టౌన్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. డిఎస్పి లక్ష్మినాయుడు కథనం మేరకు కడప జిల్లా, పెండ్లిమర్రి మండలం, తిప్పరాజు పల్లికి చెందిన ఈశ్వర్ రెడ్డి కుమారుడైన జగన్‌రెడ్డి హైదారాబాద్‌లో ఇంజనీరింగ్ చదువుతున్నాడు. రాష్ట్ర మంత్రుల ఫోన్ నెంబర్లు సేకరించి తనకు 30 వేలు రూపాయలు ఇవ్వాలని, లేకపోతే మీ ఆస్తుల వివరాలను అన్నింటిని బయట పెట్టడంతోపాటు రాజకీయగా దెబ్బతీస్తానని రాష్ట్ర అటవీశాఖా మంత్రి బొజ్జల గోపాల క్రిష్ణారెడ్డికి మెసేజ్‌ను పోస్టు చేశాడు. దీంతో మంత్రి పిఏ లక్ష్మనరసింహ చిత్తూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మెసెజ్ ఇచ్చిన ఫోన్ నెంబర్ ద్వారా ఆరా తీసి జగన్ రెడ్డిని అరెస్టు చేసినట్లు డి ఎస్పీ తెలిపారు.