ఆంధ్రప్రదేశ్‌

19కి బదులు 21 నుంచి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 16: రాష్ట్రంలోని పాఠశాలలకు ఈ నెల 21 నుండి 30 వరకు దసరా సెలవులను ప్రకటిస్తూ విద్యాశాఖ కమిషనర్ కె సంధ్యారాణి శనివారం ఉత్తర్వులు విడుదల చేశారు. తొలుత 19వ తేదీ నుంచి సెలవులు ఇవ్వాలనుకున్నారు. కేంద్ర ప్రభుత్వం, తాగునీటి మంత్రిత్వ శాఖ సంయుక్తంగా ‘స్వచ్ఛతా హీ సేవ’ అనే పరిశుభ్రతా ప్రచార కార్యక్రమాన్ని ఈ నెల 15 నుండి అక్టోబర్ 2 వరకు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నాయి. అందువల్ల ఈ నెల 18 నుండి 20 వరకు వ్యక్తిగత పరిశుభ్రత, స్వచ్ఛతా ర్యాలీలు అన్ని పాఠశాలల్లో నిర్వహించాలని కమిషనర్ ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీంతో తొలుత విద్యాశాఖ ప్రకటించిన దసరా సెలవుల్లో మార్పు చేస్తూ రెండు రోజులు పాఠశాల పనిదినాలు పొడిగించారని, కనుక సెప్టెంబరు 21 నుండి 30 వరకు సెలవులు అమలవుతాయని వివరించారు.