ఆంధ్రప్రదేశ్‌

నేడు కర్నూలులో సత్యార్థి ర్యాలీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, సెప్టెంబర్ 18:నోబెల్ పురస్కార గ్రహీత కైలాష్ సత్యార్థి బాలల సంరక్షణ కోసం మంగళవారం కర్నూలులో ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వయంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పాల్గొననున్నారు. ‘సురక్షిత బాల్యం-సురక్షిత భారతదేశం’ నినాదంతో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకూ కైలాష్ సత్యార్థి భారతదేశ యాత్ర నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. బాలల హక్కులు కాపాడటం, వారికి రక్షణ కల్పించడం కోసం ఆయన ఈ యాత్ర చేపట్టారు. ఆయన యాత్ర మన రాష్ట్రంలో అనంతపురం, కర్నూలులో మాత్రమే ఉంటుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కైలాష్ సత్యార్థి యాత్రకు కర్నూలు నగరంలోని వివేకానంద కూడలిలో మంగళవారం స్వాగతం పలికి అక్కడి నుంచి విద్యార్థులతో కలిసి ఎస్‌ఎపి క్యాంపు వరకూ ర్యాలీలో పాల్గొంటారు. అక్కడ విద్యార్థులతో కైలాష్ సత్యార్థి, ముఖ్యమంత్రి చంద్రబాబు ముచ్చటిస్తారు. కార్యక్రమం ముగిసిన తరువాత కైలాష్ సత్యార్థి తెలంగాణకు బయల్దేరివెళ్తారు.
సిఎం చంద్రబాబు పొదుపు మహిళలతో కర్నూలులోని ఎస్‌టిబిసి మైదానంలో మాట్లాడిన అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తారు.