ఆంధ్రప్రదేశ్‌

సదావర్తి భూములపై దుష్ప్రచారం: డొక్కా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, సెప్టెంబర్ 18: సదావర్తి భూములపై వైసిపి చేస్తున్న దుష్ప్రచారం మానుకోకుంటే ప్రజలు తగిన రీతిలో బుద్ధిచెప్తారని టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్, టిడిపి నేత లంకా దినకర్ హెచ్చరించారు. సోమవారం గుంటూరులోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ సదావర్తి భూముల విషయంలో రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు ఆశయాన్ని నెరవేర్చేందుకు ప్రభుత్వం భూముల వేలాన్ని పారదర్శకంగా నిర్వహించి 60.30 కోట్ల రూపాయల ధర వచ్చేలా చేసిందన్నారు. అయితే వైసిపి నేతలు భూముల విలువ 1300 కోట్లు, 5 వేల కోట్లు అంటూ చేసిన వ్యాఖ్యలు దుష్ప్రచారమేనని ఈ వేలంతో తేలడంతో వారంతా తోకముడిచారన్నారు. ట్రస్ట్ భూముల విషయంలో అసత్యారోపణలు చేయడంతో పాటు ప్రభుత్వంపై నిందలు మోపిన వైసిపి నేతలు ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.