ఆంధ్రప్రదేశ్
జలవనరులశాఖ ఇంజనీర్లకు నేటి నుంచి వర్క్షాప్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 19 September 2017
విజయవాడ, సెప్టెంబర్ 19: ప్రత్యామ్నాయ వివాద పరిష్కార పద్ధతులు అనే అంశంపై రెండురోజులపాటు జలవనరులశాఖ ఇంజనీర్లకు వర్క్షాప్ నిర్వహించనున్నారు. విజయవాడలోని నీటిపారుదలశాఖ కార్యాలయ ఆవరణలో ఈనెల 20, 21 తేదీల్లో నిర్వహించనున్నట్లు ప్రత్యామ్నాయ వివాద పరిష్కార అంతర్జాతీయ కేంద్రం జెఎల్ఎన్ మూర్తి తెలిపారు. ఈ వర్క్షాప్నకు ముఖ్య అతిధిగా జలవనరులశాఖ కమిషనర్ గిరిధర్రెడ్డి హాజరవుతారని తెలిపారు. ఈ పరిష్కార కేంద్రం సుప్రీంటకోర్టు పరిధిలో పనిచేసే స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ముఖ్య నిర్దేశకులుగా ఉంటారని తెలిపారు. శిక్షణా కార్యక్రమంలో ఇంజనీర్లకు మధ్యవర్తిత్వానికి సంబంధించి నైపుణ్యత, మెళకువలపై వివరిస్తారు.