ఆంధ్రప్రదేశ్‌

గవర్నర్ సలహాదారును కలిసిన బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ వేమూరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 19: ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ వేమూరి ఆనంద్ సూర్య హైదరాబాద్ రాజ్‌భవన్‌లో గవర్నర్ సలహాదారు ఎపివిఎన్ శర్మను మంగళవారం మర్యాద పూర్వకంగా కలిశారు. రాష్ట్రంలోని బ్రాహ్మణుల సంక్షేమం, సమగ్రాభివృద్ధి కోసం తమ సంస్థ విద్య, నైపుణ్య అభివృద్ధి రంగాలతో పాటు వారు పారిశ్రామికవేత్తలుగా ఎదగడానికి అవసరమైన మేథోపరమైన సలహాలతో పాటు, ఆర్థిక సహకారం అందచేస్తున్న తీరుతెన్నుల గురించి సూర్య వివరంగా తెలియజేశారు. ఈ కార్యక్రమాలు విజయవంతం అయ్యేందుకు తగు సూచనలు, సలహాలు ఇవ్వడమే కాకుండా స్వయంగా పాల్గొనవలసిందిగా కూడా గవర్నర్ సలహాదారును కోరగా అందుకు ఆయన సుముఖత వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ గల్ఫ్ దేశాల సమన్వయకర్త వెంకట అప్పారావు కూడా పాల్గొన్నారు.