ఆంధ్రప్రదేశ్‌

ఓపెన్ స్కూల్ ఫలితాలు విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 26: ఈ ఏడాది ఏప్రిల్‌లో నిర్వహించిన ఆంధ్ర ప్రదేశ్ ఓపెన్ స్కూల్ పబ్లిక్ పరీక్షలను మంత్రి గంటా గురువారం విడుదల చేశారు. ఇంటర్మీడియట్ పరీక్షలకు 63.86 శాతం మంది, పదో తరగతి పరీక్షల్లో 61.43 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ఎస్‌ఎస్‌సిలో 81.83 శాతం ఫలితాలతో విశాఖ జిల్లా మొదటి స్థానంలో ఉంది. 80.52 శాతంతో అనంతపురం జిల్లా రెండో స్థానంలో, 75.72 శాతంతో పశ్చిమ గోదావరి మూడో స్థానంలో ఉంది. 18.41 శాతం ఫలితాలతో కృష్ణా జిల్లా అథమ స్థానంలో ఉందని మంత్రి గంటా చెప్పారు. ఇంటర్మీడియట్‌లో 78.78 శాతంతో చిత్తూరు జిల్లా ప్రథమ స్థానంలో ఉంది. 73.37 శాతంతో నెల్లూరు జిల్లా రెండో స్థానంలో, 71.69 శాతంతో అనంతపురం జిల్లా మూడో స్థానంలో ఉంది. 27.22 శాతంతో కృష్ణా జిల్లా చివరి స్థానంలో ఉంది.