ఆంధ్రప్రదేశ్‌

సామాన్య భక్తులకు సులభంగా దుర్గమ్మ దర్శనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 20: సామాన్య భక్తులకు సులభంగా దర్శనమయ్యేలా చూడాలని కనకదుర్గ దేవస్థానం ఈవో సూర్యకుమారిని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పైడికొండ మాణిక్యాలరావు ఆదేశించారు. వెలగపూడి సచివాలయంలో మంత్రి తన చాంబర్‌లో దుర్గ గుడి ట్రస్టు సభ్యులతో సోమవారం సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భక్తులకు అన్ని వసతులు కల్పించాలని, సమస్యల పరిష్కారానికి మార్గాలను కనుగొనాలన్నారు. భక్తులకు మేలు చేసే కార్యక్రమాలు చేపట్టి, దేవస్థాన అభివృద్ధికి పాటుపడాలని పిలుపునిచ్చారు. దేవస్థానం చైర్మన్ గౌరంగబాబు, తదితరులు పాల్గొన్నారు.