ఆంధ్రప్రదేశ్‌

కేంద్రంలో కాంగ్రెస్‌దే అధికారం: రఘువీరా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మడకశిర/రొళ్ల, నవంబర్ 21: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావడం తథ్యమని, ప్రధానమంత్రిగా రాహుల్‌గాంధీ పదవి చేపట్టిన తర్వాత తొలి సంతకం ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా దస్త్రంపైనే ఉంటుందని పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అన్నారు. అనంతపురం జిల్లా నీలకంఠాపురం, రొళ్లలో మంగళవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ప్రధానమంత్రిగా రాహుల్‌గాంధీని ఎన్నుకునే సమయం అసన్నమైందన్నారు. అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా రాహుల్‌గాంధీని ఎన్నుకుంటూ సీడబ్ల్యూఎస్ సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించినట్లు తెలిపారు. 2019లో దేశవ్యాప్తంగా జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాల్లో విజయం సాధించి అధికారంలోకి రావడం ఖాయమన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం హయాంలో ప్రజలకు కష్టాలు తప్ప మరెలాంటి ప్రయోజనం కలగలేదన్నారు. ప్రధాని నరేంద్రమోదీ విదేశీ పర్యటనల పేర ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో చంద్రబాబు నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి అందిస్తామని ప్రకటించినా ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు.