ఆంధ్రప్రదేశ్
తుని ఘటనలో నిందితులను విడిపించాలనడం తగదు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 10 June 2016
ఒంగోలు, జూన్ 9 : తుని సంఘటనలో పాల్గొన్న నిందితులు, నేరస్థులను, శాంతి భద్రతలకు విఘాతం కల్పించిన వారిని విడిపించమని కాపు నేత ముద్రగడ పద్మనాభం అడగటం సమంజసమా అని కాపుకార్పోరేషన్ చైర్మన్ చలమశెట్టి రామానుజయ్య అన్నారు. గురువారం ఆయన ఒంగోలులో పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ తుని ఘటనలో నిందితులను విడిపిస్తే హింసను ప్రేరేపించినట్లు అవుతుందన్నారు. మంత్రిగా, ఎంపిగా పనిచేసిన ముద్రగడ ఇలా చేయడం వల్ల చట్టాన్ని వ్యతిరేకించినట్లు కాదా అని ప్రశ్నించారు. ముద్రగడ కోరికలు అభివృద్ధిని ఆటంకపరిచే విధంగా ఉందన్నారు.