ఆంధ్రప్రదేశ్‌

జోన్‌పై పీఎం నిర్ణయం: మంత్రి గోయల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, డిసెంబర్ 14: ఏపీకి రైల్వే జోన్ మంజూరు చేసే విషయంపై ప్రధాని మోదీ నిర్ణయం తీసుకుంటారని రైల్వే మంత్రి పీయూష్ గోయల్ అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్‌కు తెలిపారు. ఈ ప్రాంత రైల్వే సమస్యల పరిష్కారం కోరుతూ అవంతి శ్రీనివాస్ రైల్వే మంత్రికి గురువారం ఒక వినతిపత్రాన్ని అందచేశారు. ఈ సందర్భంగా విశాఖ రైల్వే జోన్ అంశం చర్చకు వచ్చింది. దీనిపై ప్రధాని మాత్రమే నిర్ణయం తీసుకోగలరని మంత్రి స్పష్టం చేశారు. ఇక, యలమంచిలి నుంచి నర్సీపట్నం వరకూ, అలాగే నరీపట్నం నుంచి చోడవరం, మాడుగుల మీదుగా అనకాపల్లికి రైల్వే లైన్ నిర్మాణ విషయమై జరిపిన సర్వే పాజిటివ్ రిపోర్ట్ వచ్చినందువలన వెంటనే పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని అవంతి విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా అనకాపల్లి, యలమంచిని రైల్వే స్టేషన్లను వరల్డ్ క్లాస్ స్టేషన్లుగా తీర్చిదిద్దాలని ఆయన సూచించారు.

చిత్రం..మంత్రి పీయూష్ గోయల్‌కు వినతిపత్రం అందజేస్తున్న అనకాపల్లి ఎంపీ