ఆంధ్రప్రదేశ్‌

సామాన్యులపై కేసులు! బడా బాబులకు జేజేలు!!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, జనవరి 17: కోడి పందేలపై పాలకుల ద్వంద్వవైఖరికి సామాన్యులు బలవుతున్నారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా కోడి పందాలకు సై అన్న సగటు మనిషి ఆనక పోలీసులు అనుసరిస్తున్న వైఖరితో సరదా తీరిపోతోంది. సంక్రాంతికి పది పదిహేను రోజుల ముందుగానే కోడి పందేలపై రాష్ట్ర ఉప ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప నుండి అధికార పార్టీకి చెందిన పలువురు నేతలు కోడి పందేలకు అనుకూలంగా వ్యవహరించారు. తూర్పు గోదావరి జిల్లాలో పలువురు ప్రజాప్రతినిధులు దగ్గరుండి మరీ పందేలు నిర్వహించారు. ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేల సమక్షంలో అట్టహాసంగా కోడి పందేలు నిర్వహించారు. ముఖ్య నేతల మద్దతు పుష్కలంగా ఉండటం, గతంలో లేని విధంగా ప్రభుత్వం నుండి కోడి పందేలపై సానుకూల ప్రకటనలు రావడంతో పందాలరాయుళ్లు బరి తెగించారు. మరోవైపు సుప్రీంకోర్టు నుండి విడుదలైన ఆంక్షలతో పోలీసులు అప్రమత్తమయ్యారు. అయితే పోలీసుల దాడులు మాత్రం సామాన్యులకే పరిమితమయ్యాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దగ్గరుండి కోడి పందాలు ఆడించిన ప్రజాప్రతినిధులు, ముఖ్య రాజకీయ పార్టీల నేతల జోలికి పోలీసులు వెళ్లకుండా జాగ్రత్త పడుతున్నారు. అయితే బడాబాబుల వద్ద ప్రాపకం లేని చిన్నా చితకా గ్రామస్థాయి నాయకులు, సంక్రాంతి సంబరాలను ఉత్సాహంగా జరుపుకునేందుకు పట్టణాల నుండి పల్లెలకు వెళ్ళిన వారిపై పోలీసులు కేసులు బనాయిస్తున్నారు. అది కూడా కీలకమైన భోగి, సంక్రాంతి రోజులను మినహాయించి, మంగళ, బుధవారాల్లో తూర్పు గోదావరి జిల్లాలో కేసులు నమోదు చేసేందుకు పోలీసులు ముందుకువచ్చారు. ముఖ్యంగా భవిష్యత్తులో సుప్రీంకోర్టు నుండి ఇబ్బంది లేకుండా, రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకే చిన్నా చితకా వ్యక్తులపై కేసులు బనాయించి, ఫలానా ప్రాంతంలో ఇన్ని కేసులు నమోదు చేసి, ఇంతమందిని అరెస్టు చేశామని చూపించే పనిలో అధికారులున్నారు. మరోవైపు రాష్టహ్రోంమంత్రి సైతం అంతా అయిపోయాక కోడి పందేలు ఆడేవారిపై కేసులు నమోదు చేస్తున్నారా? అని డీజీపీని బుధవారం అడిగినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో తూర్పు గోదావరి జిల్లాలోని ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో బడా పందేల రాయుళ్లకు మినహాయింపునిస్తూ, సామాన్యులపై కేసులు నమోదు చేసే పనిలో పోలీసులున్నారు.