ఆంధ్రప్రదేశ్
గవర్నర్ను కొనసాగించటం అనైతికం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 19 January 2018
ఒంగోలు అర్బన్,జనవరి 18: ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలకు సంబంధించి ఇంకా గవర్నర్ నరసింహన్ను కొనసాగించటం అనైతికమని శాసనమండలి సభ్యులు, తెలుగుదేశంపార్టీ సీనియర్ నేత కరణం బలరాం ధ్వజమెత్తారు. గురువారం ఒంగోలులో జరిగిన ఎన్టిఆర్ వర్ధంతి సభలో గవర్నర్పై విమర్శలు చేశారు. యుపిఎ హయాంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు నరసింహన్ను గవర్నర్గా నియమించారన్నారు. ఎన్డిఏ హయాంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలు విడిపోయిన గవర్నర్ నరసింహన్ను ఎందుకు కొనసాగిస్తున్నారని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రానికి గవర్నర్ నరసింహన్ అనుకూలంగా వ్యవహరిస్తూ ఆంధ్రప్రదేశ్కు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికే బీజేపీ రాష్టన్రేతలు కూడా కేంద్రానికి ఫిర్యాదుచేశారన్నారు.